AP Fee Reimbursement 2025: విద్యార్థులకు తీపి కబురు! భారీ బకాయిల చెల్లింపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AP Fee Reimbursement 2025: విద్యార్థులకు తీపి కబురు! భారీ బకాయిల చెల్లింపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు భారీ ఊరట లభించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని ప్రకటించారు. ముఖ్యంగా పీజీ విద్యార్థులకు గత ప్రభుత్వం రద్దు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తిరిగి అమలు చేస్తామని తెలిపారు.

ఫీజు చెల్లింపులపై మంత్రి లోకేష్ ప్రకటన

మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, “ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన మిగిలిన ఫీజు బకాయిలను త్వరలోనే విడుదల చేస్తాం. కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు మరియు తల్లిదండ్రులపై ఒత్తిడి చేయకూడదు. ఎవరి మీదైనా ఒత్తిడి వస్తే నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది” అని స్పష్టం చేశారు.

AP Fee Reimbursement ముఖ్యాంశాలు

✔️ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు దశలవారీగా చెల్లింపు.

✔️ పీజీ విద్యార్థులకు మళ్లీ రీయింబర్స్‌మెంట్ వర్తింపు.

✔️ విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తే చర్యలు.

✔️ ఏప్రిల్ 24 తర్వాత కాలేజీల అకౌంట్లలో ఫీజు జమ.

✔️ ప్రభుత్వ ఉపాధ్యాయులపై కేసుల ఉపసంహరణ.

AP Fee Reimbursement 2025

4,271 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల పరిష్కారం

ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత, రూ. 788 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఇప్పటికే చెల్లించినట్టు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ. 4,271 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విడతల వారీగా చెల్లించేందుకు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపామని తెలిపారు. ఏప్రిల్ 24 తర్వాత కాలేజీల బ్యాంక్ ఖాతాల్లో ఈ బకాయిలను జమ చేస్తామని వెల్లడించారు.

విద్యా విధానంలో కీలక మార్పులు

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు మూసివేయాలని ఎలాంటి యోచన లేదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉపాధ్యాయులపై నమోదైన కేసులను ఉపసంహరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

విద్యార్థులకు, తల్లిదండ్రులకు రిలీఫ్

ఈ నిర్ణయంతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు భారీ ఊరట లభించనుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం కావొచ్చన్న అనుమానాలు తొలగిపోనున్నాయి. ముఖ్యంగా పీజీ విద్యార్థులకు మళ్లీ రీయింబర్స్‌మెంట్ వర్తింప చేయడం వల్ల వేలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

AP Fee Reimbursement PM Kisan Scheme 2025: రైతులకు భారీ శుభవార్త.. అర్హులైన రైతులందరికీ రూ.6 వేలు డబ్బులు లభిస్తుంది

AP Fee Reimbursement P4 Survey 2025: సర్వే రెండో విడత ప్రారంభం… పాల్గొనకపోతే ఛాన్స్ మిస్!

AP Fee Reimbursement PhonePe Loan Telugu: PhonePe ద్వారా 5 లక్షల రుణం పొందడం ఎలా? పూర్తి వివరాలు

Tags:

AP Fee Reimbursement, AP Education Latest News, Nara Lokesh Announcement, PG Fee Reimbursement, AP Government Schemes, AP Student Scholarship 2025, AP Colleges Fee Payment, Andhra Pradesh Education News, AP Fee Reimbursement Status,AP Government Education Decision.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Comment

WhatsApp